విద్యుత్ రిపేర్లపై జనానికి ముందే చెప్పాలి..సదరన్ డిస్కం సీఎండీ ఆదేశం

విద్యుత్ రిపేర్లపై జనానికి ముందే చెప్పాలి..సదరన్ డిస్కం సీఎండీ ఆదేశం

హైదరాబాద్​, వెలుగు:  విద్యుత్  రిపేర్ల సమాచారాన్ని వినియోగదారులకు ఒక రోజు ముందే తెలియజేయాలని అధికారులకు సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. రిపేర్ల కోసం కరెంట్​ సరఫరా నిలిపివేసే సమయంలో ముందస్తు సమాచారం లేక వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

శుక్రవారం అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌‌లో  మాట్లాడారు. వినియోగదారులకు సమాచారం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో పత్రికా ప్రకటనలు, వినియోగదారుల మొబైల్ ఫోన్లకు, బస్తీలు, కాలనీలలో ఆటోలు, బైక్‌‌ల ద్వారా మైక్ లతో విషయాన్ని తెలియజేయాలని ఆదేశించారు.