
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ రిపేర్ల సమాచారాన్ని వినియోగదారులకు ఒక రోజు ముందే తెలియజేయాలని అధికారులకు సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. రిపేర్ల కోసం కరెంట్ సరఫరా నిలిపివేసే సమయంలో ముందస్తు సమాచారం లేక వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
శుక్రవారం అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వినియోగదారులకు సమాచారం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో పత్రికా ప్రకటనలు, వినియోగదారుల మొబైల్ ఫోన్లకు, బస్తీలు, కాలనీలలో ఆటోలు, బైక్ల ద్వారా మైక్ లతో విషయాన్ని తెలియజేయాలని ఆదేశించారు.